![]() |
![]() |
.webp)
రష్మీ సుధీర్ విడివిడిగా షోస్ చేస్తుండడంతో ఇక్కడ సుధీర్ ని పటాయించడానికి చాలామంది అమ్మాయిలు క్యూలు కడుతున్నారు. నెక్స్ట్ వీక్ ప్రసారం కాబోయే ఫామిలీ స్టార్స్ షో ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో సుధీర్ ని ఇద్దరు అమ్మాయిలు గులాబీలతో వెంటపడ్డారు. వాళ్ళే నటి జ్యోతి, గీతూ రాయల్. ఇద్దరూ కూడా ఎర్ర గులాబీలు తీసుకొచ్చి పోటీ పడి మరీ ఇవ్వడానికి ట్రై చేశారు. "చిన్నప్పటి నుంచి నీ మీద ఒక టైపాఫ్ క్రష్ ఉంది నీ మీద. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం." అంటూ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసాడు జ్యోతి. "నీ కోసం నా ప్రాణాలు ఇచ్చేటంత ప్రేమ ఉంది నాకు. మనకు పెళ్ళైతే నువ్వు లేచే ముందే నీ కళ్ళ ముందర కాఫీ పెట్టి నీకు ఎం కావాలో అది వండి ఎత్తుకుని వచ్చి ఆఫీస్ లో ఇచ్చి రాత్రి పడుకునే ముందు నీ కాళ్ళు నొక్కుతా బావా" అని గీతూ అనేసరికి "తర్వాత తర్వాత" అన్నాడు సుధీర్...ఆ మాటకు గీతూ తెగ సిగ్గు పడిపోతూ గులాబీ పువ్వు ఇవ్వడానికి కూడా చేతులు వణుకుతున్నాయి" అంది.
ఇక ఈ ఇద్దరితో సుధీర్ కోదాం డ్యూయెట్ డాన్స్ లు వేసి అలరించాడు. వీళ్లకు తగ్గట్టు అతిలోక సుందరి గెటప్ లో వచ్చిన పాగల్ పవిత్ర వచ్చి "మానవా ఏది నీ వామ హస్తము ఇమ్ము" అని అడిగింది కానీ తన చేతులను జేబుల్లో దాచేసుకుని ఇవ్వను అన్నాడు. ఇక నటి జ్యోతి గురించి సుధీర్ అడిగేసరికి తన లైఫ్ లో జరిగిన విషయం చెప్పింది. "ఒకానొక టైములో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. నేను సూసైడ్ చేసుకోబోయా..." అన్న మాట చెప్పేసరికి అష్షు రెడ్డితో పాటు అందరూ షాకయ్యారు. ఇక అక్కడి వాళ్లంతా కూడా తమ బాధల్ని చెప్పుకొచ్చారు.
![]() |
![]() |